వర్షం కురవాలని జలాభిషేకం
ABN , Publish Date - Jul 10 , 2026 | 12:05 AM
వర్షం కురావాలని మోతె మండల కేంద్రంలో గ్రామస్థులు బొడ్రాయి దేవతకు జలబిందెలతో పూజలు నిర్వహించారు.
మోతె, జూలై 9 (ఆంధ్రజ్యోతి): వర్షం కురావాలని మోతె మండల కేంద్రంలో గ్రామస్థులు బొడ్రాయి దేవతకు జలబిందెలతో పూజలు నిర్వహించారు. కోలాటం, భజనలు, నృత్యాలు చేశారు. వానలు కురిసేలా కరుణించాలని కోరుకున్నారు. అనంతరం జలబిందెలతో అభిషేకం నిర్వహించారు.