Share News

కుటుంబ సభ్యుల్లా కలిసి మెలిసి ఉండాలి

ABN , Publish Date - Feb 11 , 2026 | 11:37 PM

ఎన్నికలు ఈ రోజు వరకు మాత్రమే ఉంటాయని, రేపటి నుంచి అందరం అన్నదమ్ము ల్లా, ఒకే కుటుంబ సభ్యుల్లా కలిసి మెలిసి ఉండాలని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.

కుటుంబ సభ్యుల్లా కలిసి మెలిసి ఉండాలి
ఓటు వేస్తున్న ఎమ్మెల్యే యెన్నం

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి

మహబూబ్‌నగర్‌ అర్బన్‌, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): ఎన్నికలు ఈ రోజు వరకు మాత్రమే ఉంటాయని, రేపటి నుంచి అందరం అన్నదమ్ము ల్లా, ఒకే కుటుంబ సభ్యుల్లా కలిసి మెలిసి ఉండాలని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. బుధవారం ఆయన మ హబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌లో ఓటు వేశారు. సతీమణి ప్రసన్నతో కలిసి నగరంలోని పద్మావతి కా లనీలో గల ప్రతిభ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌ 96లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహబూబ్‌నగర్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌గా అభివృద్ధి చెందిన త రువాత జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలు ఇ వని చెప్పారు. ఏ నాయకుడి వలన అభివృద్ధి ప నులు జరుగుతాయో గమనించి ఓటు వేయాలని సూచించారు. రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నర్సింహారెడ్డి, 22వ డివిజన్‌ కార్పొరేటర్‌ అభ్యర్థి ప్రవీణ పాల్గొన్నారు.

Updated Date - Feb 11 , 2026 | 11:37 PM