Share News

ప్రజావాణి అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు

ABN , Publish Date - Apr 06 , 2026 | 11:39 PM

ప్రజావాణికి వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

ప్రజావాణి అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
కలెక్టరేట్‌లో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తున్న కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌

- ప్రజల నుంచి 103 ఫిర్యాదుల స్వీకరణ

గద్వాల న్యూటౌన్‌ , ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణికి వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించి 103 ఫిర్యాదులు అందినట్లు కలెక్టర్‌ తెలిపారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ మండలస్థాయిలోనే సంబంధిత అధికారులు ఫిర్యాదులను పరిష్కరిస్తే ప్రజలు చిన్న సమస్యలకే ఇక్కడి వరకు రావాల్సిన అవసరం ఉండదన్నారు. ఆ యాశాఖ ల అధికారులు క్రమం తప్పకుండా తమ సిబ్బందితో సమావేశాలు నిర్వహించుకొని తమశాఖల పరిధిలో వచ్చిన అర్జీలను పరిష్కరించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, ఆర్డీవో శ్రీనివాసరావు, అధికారులు ఉన్నారు.

Updated Date - Apr 06 , 2026 | 11:39 PM