యువత రాజకీయాల్లోకి రావాలి
ABN , Publish Date - Aug 09 , 2026 | 11:39 PM
యువజ న కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరిం చుకొని ఆదివారం పట్టణంలోని పార్టీ కార్యాల యం వద్ద జెండా ఆవిష్కరించారు.
మక్తల్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి) : యువజ న కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరిం చుకొని ఆదివారం పట్టణంలోని పార్టీ కార్యాల యం వద్ద జెండా ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా రాజీవ్గాంధీ, ఇందిరాగాంధీ చిత్రపటా లకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అ నంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పం డ్లు, బెడ్ర్డు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మునిసిపల్ చైర్పర్సన్ వాకిటి మానస, జడ్పీ టీసీ మాజీ సభ్యుడు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. యువత రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో యువజన కాంగ్రెస్ స్థాపించారన్నారు. యవత లో దేశభక్తి, క్రమశిక్షణ అలవర్చుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో యువత క్రమశిక్షణతో పని చేయాలని, కష్టపడ్డ వారికి పార్టీ సముచిత స్థా నం కల్పిస్తుందన్నారు. మోదీ ప్రభుత్వంలో యు వతకు ఎలాంటి మేలు జరగలేదన్నారు. ప్రతీ కార్యకర్త క్రమశిక్షణతో పనిచేసి పార్టీ బలోపే తానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో శ్రీని వాస్గౌడ్, గణేష్కుమార్, కట్టసురేష్ కుమా ర్గుప్తా, ఆనంద్గౌడ్, అమరేందర్రెడ్డి, శంకర్, నీలగౌడ్, గుంతలి రవి, నాగరాజు, గోవర్దన్, భాస్కర్, వేణుగౌడ్, బ్యాగరి సురేష్ తదితరులు పాల్గొన్నారు.