Share News

సంగమేశ్వరం బోటింగ్‌ సేవలు రద్దు

ABN , Publish Date - Jul 26 , 2026 | 11:50 PM

కృష్ణానదిలో వరద ఉధృతి పెరుగు తున్న నేపథ్యంలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సోమశిల - సంగమేశ్వరం మధ్య నడిపే బోటింగ్‌ సేవలను పూర్తిగా నిలిపివేసినట్లు జిల్లా పర్యాటకశాఖ అధికారి కల్వరాల నరసింహ ఆదివారం ఒక ప్రకట నలో తెలిపారు.

సంగమేశ్వరం బోటింగ్‌ సేవలు రద్దు
కృష్ణానది మీదుగా సంగమేశ్వర ఆలయానికి వెళ్లే మరబోటు (ఫైల్‌)

జిల్లా పర్యాటక శాఖ అధికారి నరసింహ వెల్లడి

కొల్లాపూర్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి):కృష్ణానదిలో వరద ఉధృతి పెరుగు తున్న నేపథ్యంలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సోమశిల - సంగమేశ్వరం మధ్య నడిపే బోటింగ్‌ సేవలను పూర్తిగా నిలిపివేసినట్లు జిల్లా పర్యాటకశాఖ అధికారి కల్వరాల నరసింహ ఆదివారం ఒక ప్రకట నలో తెలిపారు. జిల్లా కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. వరద నీటి మట్టం పెరిగినందున సంగమేశ్వర క్షేత్ర దర్శనం కోసం పర్యాటకులు ఎవరూ రా వద్దని ఈ విషయాన్ని గమనించి పర్యాటకులు, భక్తులు పర్యాటక శాఖకు సహకరించాలని కోరారు.

Updated Date - Jul 26 , 2026 | 11:50 PM