Share News

ప్రజా సంక్షేమమే లక్ష్యం

ABN , Publish Date - Sep 16 , 2026 | 11:53 PM

సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమ ని ఎమ్మెల్సీ కూచకుళ్ల దా మోదర్‌రెడ్డి అన్నారు.

ప్రజా సంక్షేమమే లక్ష్యం
స్మార్ట్‌ రేషన్‌ కార్డులను పంపిణీ చేస్తున్న దామోదర్‌ రెడ్డి

తెలకపల్లి, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమ ని ఎమ్మెల్సీ కూచకుళ్ల దా మోదర్‌రెడ్డి అన్నారు. బుధ వారం నాగర్‌కర్నూల్‌ జిల్లా తెలకపల్లి మండలలోని ల క్నారంలో స్మార్ట్‌ రేషన్‌ కార్డు లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ తమ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్‌ కార్డు లు, ఇందిరమ్మ ఇళ్ల్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గ్రామాల్లో మౌలిక వసతు లు మెరుగుపరచడం వంటి అనేక అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ విజయకుమార్‌, మాజీ ఎంపీపీ బండ పర్వతాలు, సింగిల్‌ విండో చైర్మన్‌ భాస్కర్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - Sep 16 , 2026 | 11:53 PM