Share News

ఓట్లు చోరీ చేసేందుకు సిద్ధమైన బీజేపీ

ABN , Publish Date - Aug 20 , 2026 | 11:29 PM

ఓట్లు చోరీ చేసేందుకు బీజేపీ సిద్ధమైందని, క్షేత్రస్థాయిలో నిజమైన ఓట్లను కాపాడేబాధ్యత బీ ఎల్‌ఏలదే అని పార్లమెంట్‌ నియోజకవర్గ ఎస్‌ఐ ఆర్‌ ఇన్‌చార్జి సిద్దేశ్వర్‌ అన్నారు.

ఓట్లు చోరీ చేసేందుకు సిద్ధమైన బీజేపీ
సమావేశంలో మాట్లాడుతున్న పార్లమెంట్‌ నియోజకవర్గ ఎస్‌ఐఆర్‌ ఇన్‌చార్జి సిద్దేశ్వర్‌

  • కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ నియోజకవర్గ ఎస్‌ఐఆర్‌ ఇన్‌చార్జి సిద్దేశ్వర్‌

గద్వాలన్యూటౌన్‌, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): ఓట్లు చోరీ చేసేందుకు బీజేపీ సిద్ధమైందని, క్షేత్రస్థాయిలో నిజమైన ఓట్లను కాపాడేబాధ్యత బీ ఎల్‌ఏలదే అని పార్లమెంట్‌ నియోజకవర్గ ఎస్‌ఐ ఆర్‌ ఇన్‌చార్జి సిద్దేశ్వర్‌ అన్నారు. గురువారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల నియోజకవర్గం ఎస్‌ఐఆర్‌-11 బీఎల్‌ ఏలకు శిక్షణ తరగతుల సమావేశానికి, నూతన ఓటరు నమోదు కార్యక్రమానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అధ్యక్షతన హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికల అధికారులతో కలిసి కుట్రలు చేస్తున్నదని అన్నారు. ఎస్‌ఐఆర్‌ నెలరోజుల ప్రక్రియను గ్రామాల్లో పూర్తిస్థాయి లో పూర్తయ్యిందని, దాదాపుగా 84.48శాతం వర కు పూర్తి చేయడం జరిగిందన్నారు. అందుకే ఈ సమావేశంలో ఫామ్‌ 6, 7, 8 ప్రక్రియను ఏ వి ధంగా అమలుచేయాలనే విషయాలపై అవగా హన కల్పించడం జరుగుతుందన్నారు. నెలరోజు ల ప్రక్రియలో గ్రామీణం, పట్టణంలోని బీఎల్‌ ఏలు క్షేత్రస్థాయిలో వెళ్లి ఎక్కడ ఓట్లు తొలగించారు, వాటికి సంబంధించిన ఆ ఓటర్ల నమోదు ప్రక్రియను చేయాలన్నారు. అలాగే ప్రజల్లో అవ గాహన కల్పించాలన్నారు. అనంతరం రాజీవ్‌ గాంధీ జయంతి సందర్భంగా నూతన ఓటరు న మోదు ప్రక్రియను ప్రారంభించారు. కార్యక్రమం లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మునిసిప ల్‌ చైర్‌పర్సన్‌ జయలక్ష్మి, ఉమ్మడి జిల్లా అసెంబ్లీ ఎస్‌ఐఆర్‌ ఇన్‌చార్జి శ్రీనివాసగౌడ్‌, జిల్లా డీసీసీ అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి, నాయకులు ఉన్నారు.

Updated Date - Aug 20 , 2026 | 11:29 PM