ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలి
ABN , Publish Date - Apr 09 , 2026 | 11:09 PM
ఆర్టిజన్స్కు ఏపీఎస్ఈబీ సర్వీసు రూల్స్ అమ లు చేయటంతోనే సంపూర్ణ న్యాయం జరుగు తుందని 1104 యూనియన్ రీజియన్ అధ్యక్షు డు జీ.స్వామి అన్నారు.
పాలమూరు, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): ఆర్టిజన్స్కు ఏపీఎస్ఈబీ సర్వీసు రూల్స్ అమ లు చేయటంతోనే సంపూర్ణ న్యాయం జరుగు తుందని 1104 యూనియన్ రీజియన్ అధ్యక్షు డు జీ.స్వామి అన్నారు. గురువారం రెండోరోజు ధర్నా చేస్తున్న ఆర్టిజన్స్కు సంఘం తరపున సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 327 యూని యన్ రీజియన్ అధ్యక్ష, కార్యదర్శులు బాబ్యనా యక్, సాయిబాబా, ప్రమోద్కుమార్, గంగాధర్, రామకృష్ణ ఆర్టిజన్స్కు మద్దతుగా ప్రసం గించారు. విద్యుత్ సంస్థలో పనిచేసే ఉద్యోగు లందరికి సమానపినికి సమానవేతనం, సమాన సర్వీసు రూల్స్ ఉండాలన్నారు. ఉమ్మడి జిల్లా జేఏసీ చైర్మన్ ఎంఏ జాకీర్, పెంటన్నల అధ్యక్ష తన ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో మేకల గౌ రయ్య, కట్టశ్రీనివాస్, విజయ్, నసీరొద్దీన్, తిరు మలేష్ తదితరులు పాల్గొన్నారు.
జడ్చర్ల డివిజన్లో ఆర్టిజన్స్ చేపట్టిన సమ్మె రెండో రోజుకు చేరుకుంది. డివిజన్లోని ఆర్టిజ న్లు ధర్నాలో కూర్చున్నారు.