Share News

సంక్షేమం, అభివృద్ధే లక్ష్యం

ABN , Publish Date - Jan 27 , 2026 | 01:20 AM

ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడంతో పాటు జిల్లా అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు.

సంక్షేమం, అభివృద్ధే లక్ష్యం

- జిల్లాలో 24,603 నూతన రేషన్‌ కార్డులు, 6166 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు

- సన్న ధాన్యం పండించిన రైతులకు రూ.137.81 కోట్ల బోనస్‌

- మహాలక్ష్మి, గృహలక్ష్మి పథకాల ద్వారా పలు కుటుంబాలకు లబ్ధి

- జిల్లాలో వేగంగా ఆసుపత్రుల నిర్మాణాలు

- గణతంత్ర వేడుకల్లో కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడంతో పాటు జిల్లా అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం జిల్లా సమీక్షృత కలెక్టరేట్‌ ప్రాంగణంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల సందర్భంగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీ సులచే గౌరవవందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన జిల్లా ప్రజలను ఉద్ధేశించి మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన 24,603 నిరుపేద కుటుంబాలకు కొత్తగా రేషన్‌కార్డులను జారీ చేశామని, తద్వారా 86,734 మందికి ప్రయోజనం పొందుతున్నారని అన్నారు. ఖరీఫ్‌ 2024-25 సీజన్‌లో సీఎం ఆర్‌ రైస్‌ డెలీవరీ 100 శాతం పూర్తి చేసి రాష్ట్రంలోనే పెద్దపల్లి జిల్లా మొదటి స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. వ్యవసాయ రంగం ఆధునీకరించేం దుకు ప్రభుత్వ వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునః ప్రారంభించి, జిల్లాలో 61 మంది రైతులను ఎంపిక చేసి 23 లక్షల 36వేల రూపాయల సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేశామని పేర్కొన్నారు. గడిచిన ఖరీఫ్‌ సీజన్‌లో 46,507 మంది రైతుల నుంచి 3,10,450 మెట్రిక్‌ టన్నుల సన్న వడ్లు కొనుగోలు చేసి క్వింటాలుకు 500 రూపాయల చొప్పున 137కోట్ల 81లక్షల బోనస్‌ రైతుల ఖాతాలలో జమ చేశామని అన్నారు. జిల్లాలో కోటి 68 లక్షల రూపాయల సబ్సిడీతో మరో 3180 ఎకరాలలో ఆయిల్‌పామ్‌ పంట విస్తరించినట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు.

ఫ మహాలక్ష్మీ పథకంతో మహిళలకు ప్రయోజనం

మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ప్రయోజనం కలుగుతున్నదని అన్నారు. 500 రూపాయలకే సబ్సిడీ గ్యాస్‌ ప్రభుత్వం అందజేస్తున్నదని, జిల్లాలో ఇప్పటి వరకు 1,18,781 మంది లబ్ధిదారులకు 9,30,027 గ్యాస్‌ సిలిండర్లను సరఫరా చేసి వారి ఖాతాల్లో 26 కోట్ల 31 లక్షల సబ్సిడీ జమ చేశామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయడం ద్వారా 169కోట్ల 29లక్షల రూపాయలు వారికి ఆదా అయ్యాయని తెలిపారు. జిల్లాలో నిరుపేదలకు 6166 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి, ప్రతి వారం నిర్మాణ ప్రగతి ఆధారంగా బిల్లులు విడుదల చేస్తున్నామని అన్నారు. గృహజ్యోతి పథకం కింద జిల్లాలో 200 యూనిట్లకు లోబడి విద్యుత్‌ను వినియోగిస్తున్న 1,34,896 మంది కుటుంబాలకు 111కోట్ల 55లక్షల రూపాయలు ఆదా అయ్యాయని తెలి పారు. టీజీ రెడ్కో ద్వారా మంథని, నందిమేడారం, కాల్వ శ్రీరాంపూర్‌, అప్పన్నపేటలో 12కోట్ల రూపాయల వ్యయంతో ఒక మెగా వాట్‌ సామర్థ్యం గల విద్యుత్‌ సోలార్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 66కోట్ల 63లక్షలు ఖర్చు చేసి 45,695 కుటుం బాలకు ఉపాధి కల్పించామని, జిల్లాలో 7716 మంది స్వశక్తి సంఘాలకు 477కోట్ల 86లక్షల రూపాయల బ్యాంకు లింకేజీ కింద రుణాలను, వడ్డీ లేని రుణాల పథకం కింద 8 కోట్ల 48లక్షల నిధులు విడుదల చేసినట్లు వివరించారు. మహి ళలకు ఆర్థిక, వ్యాపార నిర్వహణలో శిక్షణ ఇచ్చేందుకు పెద్దపల్లిలోని రంగంపల్లి వద్ద వీ- హబ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు.

ఫ రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.91.14 కోట్లతో ఉచిత వైద్యం

రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రేషన్‌కార్డులు కలిగిన కుటుంబాలకు 10 లక్షల వరకు ఉచిత వైద్య సౌకర్యం కల్పి స్తున్నదని, జిల్లాలో 91 కోట్ల 14 లక్షలు ఖర్చు చేస్తూ 37,053 మంది రోగులకు శస్త్రచికిత్సలు నిర్వహించారని అన్నారు. 23కోట్ల 75 లక్షలతో గోదావరిఖని ఆసుపత్రి వద్ద చేపట్టిన 50 పడకల క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌, నంది మేడారంలో 5 కోట్ల 75 లక్షలతో చేపట్టిన 30 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు పూర్తి చేశామని, 51 కోట్లతో జిల్లా కేంద్రంలో చేపట్టిన 100 పడకల ఆసుపత్రి, 22 కోట్లతో మంథనిలో చేపట్టిన 50 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. 187 కోట్ల 23 లక్షల డీఎం ఎఫ్‌టీ నిధులతో ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా 18 కొత్త రొడ్లు, 119 కోట్లతో కూనారం ఆర్‌ఓబీ 160 కోట్ల 30 లక్షల రూపాయలతో గోదావరిఖనిలో చేపట్టిన 350 పడకల ఆసు పత్రి భవన నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయని అన్నారు. 2025-26లో 18 జాబ్‌ మేళాలు నిర్వహించి 290 మంది యువతకు ప్రైవేట్‌ సంస్థలలో ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా 16 కోట్ల 77లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పించామని, 41 లక్షలతో 468 పాఠశాలలకు గ్యాస్‌ సిలిండర్లు, స్టవ్‌లను పంపిణీ చేసి నట్లు తెలిపారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురు కులాల ద్వారా విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామ పంచాయతీలకు విజయవంతంగా ఎన్ని కలను నిర్వహించి, నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌, వార్డు సభ్యులకు పంచాయతీ పరిపాలనపై ప్రత్యేక శిక్షణ అందిం చినట్లు తెలిపారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతటి అన్నయ్య గౌడ్‌, డీసీపీ రాంరెడ్డి, అదనపు కలెక్టర్‌ లు జే అరుణశ్రీ, డి వేణు, పెద్దపల్లి ఆర్‌డీఓ బి గంగయ్య, వివిధ శాఖల అధికారులు కలెక్టరేట్‌ ఏఓ బండి ప్రకాష్‌, ప్రజాప్రతినిధులు, పోలీస్‌ శాఖ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Jan 27 , 2026 | 01:20 AM