Share News

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Mar 27 , 2026 | 11:47 PM

రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. శుక్రవారం చొప్పదండి వ్యవసాయ మార్కెట్‌లో మార్క్‌ఫెడ్‌ మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
చొప్పదండిలో మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

చొప్పదండి, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. శుక్రవారం చొప్పదండి వ్యవసాయ మార్కెట్‌లో మార్క్‌ఫెడ్‌ మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు రైతు భరోసా, రుణ మాఫీతోపాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. రైతులు తమ మొక్కజొన్నలను దళారులకు విక్రయించకుండా కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకొని మద్దతు ధర పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ చైర్మన్‌ కొత్తూరు మహేష్‌, వైస్‌ చైర్మన్‌ రాజేందర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వడ్లూరి సరిత, కార్యదర్శి రాజేశ్వరి, ఇప్ప శ్రీనివాస్‌ రెడ్డి, కళ్లెం తిరుపతిరెడ్డి, కౌన్సిలర్లు, డైరెక్టర్లు, నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2026 | 11:47 PM