బీఆర్ఎస్ పాలన దోపిడీమయం
ABN , Publish Date - Jan 15 , 2026 | 12:28 AM
బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని దోచు కున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు మార్ విమర్శించారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్
ధర్మపురి, జనవరి14 (ఆంధ్రజ్యోతి ): బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని దోచు కున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు మార్ విమర్శించారు. ధర్మపురి పట్ట ణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో బుధవారం ఆయన విలేకరు లతో మాట్లాడారు. కేటీఆర్ చేస్తున్న డ్రామాలు ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నమేనని ఆయన తీవ్రంగా విమర్శించారు. కృష్ణా జలాల అంశం లో ప్రజలను కావాలని తప్పుదోవ పట్టిస్తున్న బీఆర్ఎస్, గతంలో ఈ అంశంపై చర్చకు వస్తే అసెంబ్లీ నుంచి పారిపోయిందన్నారు. కృష్ణా- గోదావరి జలాల వినియోగంపై కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముం దుకు సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యు లు, ధర్మపురి మండల కాంగ్రెస్ అధ్య క్షులు దినేష్, ఆలయ ధర్మకర్తల మం డలి చైర్మన్ జక్కు రవీందర్, మండల కాంగ్రెస్ ఉపాధ్య క్షులు రాజేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ పాల్గొన్నారు.