Peddapalli: అందరూ సంతోషంగా జీవించాలి
ABN , Publish Date - Sep 21 , 2026 | 12:41 AM
మంథని, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): విఘ్నేశ్వరుడి దయంతో అందరూ సంతోషం గా జీవించాలని కోరుకున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వెల్లడించారు.
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు
మంథని, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): విఘ్నేశ్వరుడి దయంతో అందరూ సంతోషం గా జీవించాలని కోరుకున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వెల్లడించారు. వినాయక ఉత్సవాల్లో భాగంగా స్థానిక ఆర్సీ కట్టలోని వినాయకమండపంలో వేద పండి తుల ఆధ్వర్యంలో గణపతిహోమాన్ని మంత్రి శ్రీధర్బాబు నిర్వహించారు. అనంతరం గణ నాథుడికి, శ్రీమహాలక్ష్మి అమ్మవారికి శ్రీధర్ బాబు ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలంతా సుభిక్షంగా ఉండా లనే సంకల్పంతో పలుఅభి వృద్ధి, సంక్షేమ పథకాలతో తమ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నా రు. ఆయనవెంట మున్సిపల్ చైర్మన్ వొడ్నాలశ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి, ఈఆర్సీ మెంబర్ శశిభూషన్ కాచే, మండల పార్టీ అధ్యక్షుడు ఐలిప్రసాద్, పీఏసీఎస్, ఏఎంసీ చైర్మన్లు కొత్తశ్రీనివాస్, వెంకన్న, డీసీసీ అధి కార ప్రతినిధి సెగ్గెం రాజేష్, కాంగ్రెస్ నేతలు ఉన్నారు.