Peddapalli: పోలీస్ క్వార్టర్లను పరిశీలించిన సీపీ
ABN , Publish Date - Apr 10 , 2026 | 12:11 AM
కోల్సిటీ, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): గోదావరిఖని ఐబీ కాలనీలో పోలీస్ అధికారులు, సిబ్బంది కోసం నిర్మించిన నూతన భవనాలను గురువారం రామగుండం పోలీస్కమిషనర్ అంబర్ కిశోర్ఝా పరిశీలించారు.
కోల్సిటీ, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): గోదావరిఖని ఐబీ కాలనీలో పోలీస్ అధికారులు, సిబ్బంది కోసం నిర్మించిన నూతన భవనాలను గురువారం రామగుండం పోలీస్కమిషనర్ అంబర్ కిశోర్ఝా పరిశీలించారు. పెండిం గ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని, ప్రారంభోత్స వానికి అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. సీపీ వెంట డీసీపీ రాంరెడ్డి, గోదావరిఖని ఏసీపీ రమేష్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్రావు, ఆర్ఐ శేఖర్, రమేష్ ఉన్నారు.