Share News

Peddapalli: జాప్యం లేకుండా సీఎంపీఎఫ్‌ సేవలు

ABN , Publish Date - Feb 07 , 2026 | 12:24 AM

రామగిరి, ఫిబ్రవరి 6 (ఆంరఽధజ్యోతి): జాప్యం లేకుండా సీఎంపీఎఫ్‌ సేవలను అందించేందుకు కృషి చేస్తున్నామని సీఎంపీఎఫ్‌ రీజినల్‌ కమిషనర్లు హరిపచౌరి, గోవర్ధన్‌ అన్నారు.

Peddapalli:  జాప్యం లేకుండా సీఎంపీఎఫ్‌ సేవలు

- కమిషనర్లు హరిపచౌరి, గోవర్ధన్‌

రామగిరి, ఫిబ్రవరి 6 (ఆంరఽధజ్యోతి): జాప్యం లేకుండా సీఎంపీఎఫ్‌ సేవలను అందించేందుకు కృషి చేస్తున్నామని సీఎంపీఎఫ్‌ రీజినల్‌ కమిషనర్లు హరిపచౌరి, గోవర్ధన్‌ అన్నారు. శుక్రవారం జీఎం కార్యాలయంలో సంబంధిత అధికారులు, ఉద్యోగు లతో ప్రయాస్‌ ఆరవషెడ్యూల్‌లో భాగంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాగితరహితసేవలు అందిం చడమే లక్ష్యంగా లావాదేవీలు సి-కేర్స్‌పోర్టల్‌ ద్వారా మాత్ర మే జరుతున్నాయన్నారు. మధ్యవర్తులు లేకుండా పారదర్శకంగా సీఎంపీఎఫ్‌ పొంద వచ్చునన్నారు. పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్స్‌, రివైజ్డ్‌పెన్షన్‌ తదితర అంశాలపై చర్చించారు. తొలుత కమిషనర్లుకు ఎన్‌సీడబ్ల్యూ ఉద్యోగుల రివైజ్డ్‌ పెన్షన్‌ పేమెంట్‌ 69పీపీవో ఆర్డర్స్‌ను ఆర్జీ-3 జీఎం మధుసూదన్‌ అందజేశారు. సమావేశంలో గుర్తింపు, ప్రాతినిధ్యసంఘాల నాయ కులు రామచంద్రారెడ్డి, రామారావు, అధికారులు కోల శ్రీనివాస్‌, రామ్మోహన్‌, బండిసత్యనారాయణ, సురేఖ, రాజేంద్రకుమార్‌, సుదర్శనం, అనిత, సునీల్‌ ప్రసాద్‌, మనోహర్‌, ప్రదీప్‌రెడ్డి, కుమార స్వామి, వివిధగనుల సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2026 | 12:24 AM