నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలి
ABN , Publish Date - Jan 29 , 2026 | 12:34 AM
మున్సిపల్ ఎన్ని కలలో అధికారులు విధులను నిజాయితీగా, నిష్పక్షపా తంగా నిర్వహించాలని ఇన్చార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
సిరిసిల్ల, జనవరి 28 (ఆంధ్రజ్యోతి) : మున్సిపల్ ఎన్ని కలలో అధికారులు విధులను నిజాయితీగా, నిష్పక్షపా తంగా నిర్వహించాలని ఇన్చార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ ఆదేశించారు. బుధవారం రాజ న్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదా యంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎన్నికల విధులపై జోనల్ ఆధికారులు, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృదాలకు జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి శిక్షణ ఇచ్చారు. ఈసందర్భంగా గరిమ అగ్రవాల్ మాట్లా డుతూ మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఒక్కరికీ సమానమైన హక్కు కల్పిస్తూ పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశిం చారు. ఎలాంటి రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో అధికా రులు, సిబ్బంది పాల్గొనకూడదని స్పష్టం చేశారు. పార దర్శకంగా ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఉల్లంఘనలను, నగదు, మద్యం పంపిణీని గుర్తించడం, ఆధారాలు సేకరించడం, వీడియో రికార్డు చేయడం చాలా కీలకమని, ఎన్నికల సమయంలో అక్రమ డబ్బు, నగదు సరఫరా జరగకుం డా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ఏ మాత్రం నిర్లక్షం ప్రదర్శించవద్దని సూచించారు. వీటికి సంబంధిం చిన అన్ని వివరాలతో సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. ఎన్నికలకు సంబంధించి అక్ర మ నగదు, మద్యం పంపిణీ అరికట్టడమే లక్ష్యమని, సాధారణ ప్రజలకు అసౌకర్యం కలగకుండా వీలైనంత వరకు జాగ్రత్తలు వహించాలని సూచించారు. నగదు సీజ్ చేసే సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశిం చిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని, నగదు సీజ్ చేసే సమయంలో ఎక్కడ అప్పీల్ చేయాలనే అంశం స్పష్టంగా తెలియజేస్తూ రశీదు అందించాలన్నా రు. నగదు సీజ్ చేసిన సమాచారం ఐటీ అధికారులకు ఇవ్వాలని సూచించారు. సభలు, ర్యాలీలను క్షుణ్ణంగా పరిశీలించాలని, వినియోగించిన వాహనాలు, కుర్చీలు, భోజనం తదితర ప్రతి అంశాన్ని పరిశీలించి వివరాలు నమోదు, రికార్డు చేయాలని సూచించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై అప్రమత్తంగా ఉంటూ ఆధారాలు సేక రించాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావ ళి అమలులోకి వచ్చిన తరువాత రూ.50 వేల కంటే ఎక్కువ డబ్బు తరలిస్తే పట్టుకొని, వీడియో తీసి పంచ నామా చేయాలని, అనంతరం పట్టుకున్న డబ్బుకు సం బంధించి రసీదు అందజేయాలని సూచించారు. ప్రచార వాహనాలకు మున్సిపల్ కమిషనర్లు, లౌడ్స్పీకర్లకు పోలీ స్ల నుంచి అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. ర్యాలీలు, సభలు, సమావేశాలకు సమీప ఎస్హెచ్వోల నుంచి ఎన్వోసీ తీసుకున్న తర్వాత మున్సిపల్ కమిషన ర్ అనుమతివ్వాలని ఆదేశించారు. ప్రతి వార్డు సభ్యుడు రూ.లక్ష వరకు ఎన్నికల వ్య యం చేయవచ్చని వెల్లడిం చారు. జోనల్ ఆఫీసర్స్ తమ పరిధిలోని అన్ని పోలింగ్ కేం ద్రాల్లో మూడు సార్లు తనిఖీ చేయాలని సూచించారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, టాయిలె ట్స్ వినియోగంలో ఉన్నాయా చూడాలని ఆదేశించారు. ది వ్యాంగులకు ప్రత్యేక సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. ఎ న్నికల రోజు అధికారులు, సి బ్బందికి అన్ని వసతులు కల్పించాలని తెలిపారు. ఎన్నిక లకు 48 గంటల ముందు ప్రచారం నిలిపివేయాలని తెలిపారు. స్థానికేతరులు ఇక్కడ ఉండకుండా చూడాల ని సూచించారు. పోలింగ్ రోజున డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఆయా పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల అధికారు లు, సిబ్బంది జోనల్ అధికారులుతో పాటు వారికి కేటా యించిన వాహనాల్లోనే వెళ్లాలని స్పష్టం చేశారు. ప్రతి రోజు అన్ని టీంలు నివేదికలను జిల్లా అధికారులు, పోలీ స్ అధికారులకు పంపాలని సూచించారు. అనంతరం జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు విధులు నిర్వహించాలని సూచించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పక్కాగా అమలు చేయాలన్నారు. ఎన్ని కలు స్వేచ్ఛాయుత వాతావరణంలో పూర్తి చేయాలన్నా రు. సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, అదన పు ఎస్పీ చంద్రయ్య, నోడల్ అధికారులు గీత, శ్రీనివాసా చారి, నవీన్, ట్రైనర్ మహేందర్రెడ్డి పాల్గొన్నారు.