ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణ
ABN , Publish Date - Jan 29 , 2026 | 12:43 AM
స్వేచ్చగా, ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు చేశామని ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు.
వేములవాడ, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): స్వేచ్చగా, ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు చేశామని ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నోటిషికేషర్ విడుదల అయిన నేప థ్యంలో మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన నామి నేషన్ స్వీకరణ కేంద్రాన్ని ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్ర వాల్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా నామి నేషన్ కేంద్రాల్లో ఓటరు జాబితా, రిజర్వేషన్ జాబితా, నో డ్యూ సర్టిఫికెట్, ఇతర ఏర్పాట్లను పరిశీలించి, నామినేష న్ల స్వీకరణ ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా జరిగే లా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారుల ను ఆదేశించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కల గకుండా తగిన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. నామినేషన్ కేంద్రాల్లో తగిన సంఖ్యలో సిబ్బంది అందుబాటులో ఉండాలని, క్యూలైన్ నిర్వహణ, తదితర అంశాలపై దృష్టి సారించాలని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖతో సమన్వయం చేసు కోవాలని, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ జరుపాలని ఆదేశించారు. ప్రతి నామినేషన్ కేంద్రంలో గడియారం ఉండాలని పేర్కొన్నారు. అభ్యర్థులు, ప్రజల కు త్రాగునీరు, తదితర సదుపాయాలు అందబాటులో ఉండేలా చూడాలని సూచించారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలు, నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన జరగకుండా పర్యవేక్షణ జరపాలని అధికారు లకు ఆదేశించారు. నామినేషన్ దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ విలేకర్లతో మాట్లాడుతూ ఈనెల 28వ తేదీ నుంచి 30వ తేది వరకు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించేందుకు అన్ని ఏర్పాట్లుచేశామని వెల్లడించారు. నామినేషన్ కేం ద్రంలోకి అభ్యర్థితో పాటు ఇద్దరికి మాత్రమే అను మతి ఉంటుందని స్పష్టం చేశారు. నామినేషన్ కేంద్రం వద్ద 100మీటర్ల వరకు రెండు వాహనాల కు అనుమతి ఉంటుందని తెలిపారు. వేములవాడ లో 28 వార్డులకు సంబంధించి 10 మంది ఆర్వోలు, 10 మంది ఏఆర్వోలు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదే శాలకు అనుగుణంగా నియమించామని తెలిపారు. ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ టీమ్లను నియమించామని వివ రించారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చామని వెల్లడించారు. పోటీచేసే అభ్యర్థులు ఎన్నికల సం ఘం నిబంధనల మేరకు నూతన బ్యాంకు ఖాతా, అఫిడవిట్, బలపరిచే వారి వివరాలు, మిగతా ప త్రాలు సమర్పించాలని సూచించారు. ప్రతి మున్సిపల్ కేంద్రంలో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశామని తెలిపారు. వారి వద్ద పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుం దని వెల్లడించారు. జిల్లా యంత్రాంగం మున్సిపల్, పోలీసుల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశామని తెలి పారు. ఆమె వెంట అదనపు ఎస్పీ చంద్రయ్య, వేముల వాడ ఆర్డీవో రాధాబాయి, తహసీల్దార్ జయంత్కుమార్, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ తదితరులు ఉన్నారు.