Share News

అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు

ABN , Publish Date - May 26 , 2026 | 12:42 AM

అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్ళను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్‌ మేడిపల్లి సత్యం అన్నారు. సోమవారం మండలకేంద్రానికి చెం దిన ఏడెల్లి కాంతవ్వ రాజయ్యకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళు మం జూరు చేయగా నిర్మాణం పూర్తి చేసుకోగా గృహప్రవేశానికి చొప్పదండి ఎమ్మెల్యే సత్యం హాజరై మాట్లాడుతూ పేదల సంక్షేమమే ప్రభు త్వ లక్ష్యమన్నారు.

అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు
ఇందిరమ్మ ఇంటిని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే

కొడిమ్యాల, మే 25(ఆంధ్రజ్యోతి) : అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్ళను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్‌ మేడిపల్లి సత్యం అన్నారు. సోమవారం మండలకేంద్రానికి చెం దిన ఏడెల్లి కాంతవ్వ రాజయ్యకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళు మం జూరు చేయగా నిర్మాణం పూర్తి చేసుకోగా గృహప్రవేశానికి చొప్పదండి ఎమ్మెల్యే సత్యం హాజరై మాట్లాడుతూ పేదల సంక్షేమమే ప్రభు త్వ లక్ష్యమన్నారు. మండలంలోని తురుక కాశీనగర్‌ గ్రామంలో మహిళా సంఘ భవనా నికి భూమిపూజ చేసారు. కార్యక్రమంలో పీఆర్‌ డీఈఈ చంద్రశేఖర్‌, ఏఈఈ చంద్రశేఖర్‌ సర్పంచు షేక్‌సాదిథియాహుస్సేన్‌ పాల్గొన్నారు.

పెద్దమ్మ ఆలయంలో పూజలు

మండల కేంద్రంలోని పెద్దమ్మ ఆలయంలో బోనాల పండగను పురస్కరించుకొని సోమ వారం చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్‌ మేడిపల్లి సత్యం ప్రత్యేక పూజలు చేసారు. కొడిమ్యాల ముదిరాజు సంఘం నాయకులు, సభ్యులు ఎమ్మెల్యేకు సన్మానం చేసారు.

ఈ కార్యక్రమాలలో ఎమ్మెల్యే వెంట సర్పంచుల ఫోరం జిల్లా ఉపా ధ్యక్షుడు గడ్డం జీవన్‌రెడ్డి సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మల్లేశం, సింగిల్‌ విండో చైర్మన్‌ రాజనర్సింగరావు, కొడిమ్యాల ఉప సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు నర్సయ్యగౌడ్‌, తదితరులు ఉన్నారు.

Updated Date - May 26 , 2026 | 12:42 AM