Share News

మెరుగైన వైద్య సేవలందించాలి

ABN , Publish Date - Mar 05 , 2026 | 12:39 AM

వైద్యులు, సిబ్బంది రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశిం చారు.

మెరుగైన వైద్య సేవలందించాలి

బోయినపల్లి, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): వైద్యులు, సిబ్బంది రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశిం చారు. బోయినపల్లి ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో కలెక్టర్‌ బుధవా రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ల్యాబ్‌, ఇన్‌పేషెంట్‌ వార్డు, వ్యాక్సిన్లు, ఓపీ రిజిస్టర్‌ పరిశీలించి, సూచనలు చేశారు. సిబ్బంది హాజ రు రిజిస్టర్‌ తనిఖీ చేశారు. రోజు ఎంత మంది పేషెంట్లు వస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. గర్భిణుల రిజిస్ట్రేషన్‌, టీకాలు, మందుల పంపి ణీపై ఆరాతీశారు. పలువురు పేషెంట్లతో మాట్లాడి.. వారి ఆనారోగ్య సమస్యను తెలుసుకున్నారు. పీహెచ్‌సీ పరిధిలో కొత్తగా, ఇప్పటికే మొదలుపెట్టిన హెల్త్‌సబ్‌ సెంటర్ల నిర్మాణాల పురోగతిపై వైద్యాధికారిని ఆరా తీశారు. వాటిపై అధికారులతో మాట్లాడి పనులు త్వరగా పూర్తి చేసేలా చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ గరిమ అగ్ర వాల్‌ మాట్లాడూ ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో వైద్యులు, సిబ్బంది నిత్యం సమయానుసారంగా అందుబాటులో ఉండాలని సూచించారు. ఎండాకాలం నేపథ్యంలో ప్రజలకు జాగ్రత్తలు తెలియజేయాలన్నారు.

తహసీల్దార్‌ కార్యాలయంలో తనిఖీ

మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయంలో కలెక్టర్‌ గరిమ అగ్ర వాల్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా అధికారులు, సిబ్బంది హాజరు రిజిస్టర్‌, భూ భారతి రిజిస్ట్రేషన్‌ గది, కార్యాలయంలో పరిశీలిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. కార్యాలయానికి వచ్చే వారికి సేవలు అందించాలని సూచించారు. స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారి కి అందుబాటులో ఉండాలని ఎప్పటికప్పుడు రిజిస్ట్రేషన్లు పూర్తి చేయా లని ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా విధులు నిర్వర్తిం చాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మెనూ ప్రకారం భోజనం అందించాలి

బోయినపల్లి కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్‌, వంట గది, బియ్యం, పప్పులు, గుడ్లు ఇతర ఆహార పదార్థాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజన సమయం కావడంతో మెనూ పరిశీలించారు. కలెక్టర్‌ ప్లేట్‌ తీసుకొని విద్యార్థులతో కలిసి కింద కూర్చొని భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అని ఆరా తీశారు. రోజు తింటున్న ఆహారంలో విటమిన్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్‌ ఏమి ఉన్నాయని ప్రశ్నించారు. రోజూ ఎంత పరిమాణంలో తీసుకోవాలి.. విద్యార్థులు వార్షిక పరీక్షలకు ఎలా సిద్ధం అవుతున్నారని ప్రశ్నించారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నా యా అని ఆరా తీశారు. అనంతరం విద్యాలయంపై అంతస్తులో నిర్మి స్తున్న గదులు, టాయిలెట్లు ఇతర పనులపై ఉపాధ్యాయుల నుంచి కలెక్టర్‌ వివరాలు తెలుసుకున్నారు. పదో తరగతి, ఇతర తరగతుల విద్యార్థులు ప్రతి సబ్జెక్ట్‌కు సంబంధించి అన్ని పాఠాలు చదవాలి.. రాయాలి అని సూచించారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, లక్ష్యం నిర్దేశించుకొని ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఉద్యోగం లేదా వృత్తిలో స్థిరపడిన తర్వాత మిగతా విషయాలు ఆలోచించాలని దిశా నిర్దేశం చేశారు.

Updated Date - Mar 05 , 2026 | 12:39 AM