Share News

ఆర్టిజన్‌ కార్మికుల నిరసన ర్యాలీ

ABN , Publish Date - Apr 15 , 2026 | 12:21 AM

ఆర్టిజన్‌ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన నిరసనల్లో భాగంగా మంగళవారం ఆర్టిజన్‌ కార్మికులు ర్యాలీ నిర్వహించారు.

ఆర్టిజన్‌ కార్మికుల నిరసన ర్యాలీ

గణేశ్‌నగర్‌,ఏప్రిల్‌14(ఆంధ్రజ్యోతి): ఆర్టిజన్‌ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన నిరసనల్లో భాగంగా మంగళవారం ఆర్టిజన్‌ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్‌ సర్కిల్‌ ఆఫీస్‌ నుంచి అంబేద్కర్‌ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్‌ విగ్రహానికి డిమాండ్‌ నోటీస్‌ అందజేశారు. ఈ సందర్బంగా టీవీఏఈ జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఆర్టిజన్‌ కార్మికులకు ఒకే సంస్థలో ఒకే సర్వీస్‌ రూల్స్‌ అమలు చేయాలని అన్నారు. అన్‌మ్యాన్‌డ్‌ ్డ కార్మికులను విలీనం చేసుకోవాలన్నారు. యజమాన్యం టర్మినేషన్‌ కాపీ రద్దుచేసి కార్మికులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమనికి రాష్ట్ర కో కన్వీనర్‌ చందర్‌ సింగ్‌ ఠాకూర్‌, ఎండి అలీఖాన్‌, సయ్యద్‌ కరీముద్దీన్‌, సయ్యద్‌,సిరాజ్‌, బాబాఖాన్‌ హాజరయ్యారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కన్వీనర్‌ గుగులోతు శివకృష్ణ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. సమ్మెకు ఆర్టిజన్‌, అన్‌మ్యాన్‌డ్‌ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Apr 15 , 2026 | 12:21 AM