వడ్డె ఓబన్నకు ఘన నివాళి
ABN , Publish Date - Jan 12 , 2026 | 12:48 AM
రాయికల్ మండలంలోని చింతలూరు గ్రామంలో ఆదివారం తొలి స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డె ఓబన్న జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
రాయికల్, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): రాయికల్ మండలంలోని చింతలూరు గ్రామంలో ఆదివారం తొలి స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డె ఓబన్న జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సుమారు 39 ఏళ్ల వయస్సులో 1846-47 మధ్య జరిగిన పోరాటంలో వీరోచితంగా పోరాడుతూ అమరులయ్యారని పేర్కొన్నార. ఒడ్డెర కులస్థులందరూ గొప్ప పండుగలా జయంతి వేడుకలను నిర్వహించుకోవాలని అన్నారు.
మండలంలోని ఒడ్డెలింగాపూర్ గ్రామంలోని ఒడ్డెర కాలనీలో ఓబన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఒడ్డెర యువజన సంఘం జగిత్యాల జిల్లా కోశాధికారి పల్లపు రాజేష్, మండల యూత్ ఉపాధ్యక్షుడు పల్లపు రజనీకాంత్, పలువురు గ్రామ నాయకులు పాల్గొన్నారు.