Mancherial: ప్రజావ్యతిరేక విధానాలకు కేంద్రం స్వస్తి పలకాలి
ABN , Publish Date - Aug 12 , 2026 | 11:55 PM
బెల్లంపల్లి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ప్రజా, కార్మిక, కర్షకవ్యతిరేక విధానాలకు కేంద్ర ప్రభు త్వం స్వస్తిపలకాలని సీపీఐ రాష్ట్రకంట్రోల్ కమి షన్ కార్యదర్శి మిట్టపల్లి వెంకటస్వామి
బెల్లంపల్లి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ప్రజా, కార్మిక, కర్షకవ్యతిరేక విధానాలకు కేంద్ర ప్రభు త్వం స్వస్తిపలకాలని సీపీఐ రాష్ట్రకంట్రోల్ కమి షన్ కార్యదర్శి మిట్టపల్లి వెంకటస్వామి పేర్కొన్నా రు. సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టన ప్రజాపోరు చైతన్యపోరు యాత్ర బుధ వారం బెల్లంపల్లికి చేరు కోగా భగత్సింగ్, అంబే ద్కర్, మాజీఎమ్మెల్యే గుండా మల్లేష్ విగ్రహా లకు పూలమాలలు వేసి యాత్రను ప్రారంభిం చారు. ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ వారిని చైతన్య పర్చడం కోసం పోరుయాత్ర చేపట్టామన్నారు. కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి ఆడెపురాజమౌళి, రాష్ట్రసమితి సభ్యు రాలు బొల్లం పూర్ణిమ, జిల్లాకార్యవర్గ సభ్యులు చిప్ప నర్సయ్య, నాయకులు బాబు, లక్ష్మీనారా యణ, బానేష్, పోశం, చంద్రమాణిక్యం, శ్రీధర్, రాజం, సోని, ప్రవీణ్కుమార్, రాజేందర్, లక్ష్మీ నారాయణ, రాంచందర్, కొమురయ్య, శంకర్, రాజేందర్, స్వామిదాసు, తిరుపతి, చంద్రయ్య పాల్గొన్నారు.