Share News

రోమ్‌ డైమండ్‌ లీగ్‌కు సచిన్‌

ABN , Publish Date - May 12 , 2026 | 02:52 AM

భారత టాప్‌ జావెలిన్‌ త్రోయర్‌ సచిన్‌ యాదవ్‌ ప్రతిష్ఠాత్మక డైమండ్‌ లీగ్‌లో అరంగేట్రం చేయనున్నాడు. వచ్చేనెల 4న...

రోమ్‌ డైమండ్‌ లీగ్‌కు సచిన్‌

న్యూఢిల్లీ: భారత టాప్‌ జావెలిన్‌ త్రోయర్‌ సచిన్‌ యాదవ్‌ ప్రతిష్ఠాత్మక డైమండ్‌ లీగ్‌లో అరంగేట్రం చేయనున్నాడు. వచ్చేనెల 4న రోమ్‌లో జరిగే ఈ లీగ్‌లో పోటీపడే మొత్తం ఎనిమిది మంది త్రోయర్లలో సచిన్‌ పేరును కూడా నిర్వాహకులు చేర్చారు. 26 ఏళ్ల సచిన్‌.. గతేడాది ప్రపంచ చాంపియన్‌షి్‌పలో స్టార్‌ నీరజ్‌ చోప్రాను తోసిరాజని అత్యుత్తమంగా నాలుగోస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. కాగా, రిహాబిలిటేషన్‌లో భాగంగా ప్రస్తుతం తుర్కియేలో ఉన్న చోప్రా.. రోమ్‌ డైమండ్‌ లీగ్‌లో ఆడడం లేదు.

ఇవి కూడా చదవండి:

ఐపీఎల్ ఫైనల్స్: అహ్మదాబాద్ స్టేడియానికే ఎందుకింత ప్రాధాన్యం?

భువీని భారత జట్టులోకి తీసుకురావాలి: రవిచంద్రన్ అశ్విన్

Updated Date - May 12 , 2026 | 02:52 AM