బాక్సింగ్ క్వార్టర్స్కు ప్రీతి, జాదూమణి
ABN , Publish Date - Jul 27 , 2026 | 03:44 AM
కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లు ప్రీతి పవార్, జాదూమణి సింగ్లు క్వార్టర్స్కు దూసుకెళ్లారు...
గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లు ప్రీతి పవార్, జాదూమణి సింగ్లు క్వార్టర్స్కు దూసుకెళ్లారు. మహిళల 54 కిలోల విభాగంలో డెబోరా టెంజీ (మాల్వి)ని ప్రీతి రెండో రౌండ్లోనే నాకౌట్ చేసింది. ప్రీతి పంచ్లకు డెబోరా నిలవలేక పోవడంతో కౌంట్ ఇచ్చిన రెఫెరీ.. బౌట్ను నిలిపివేశాడు. పురుషుల 55 కిలోల ప్రీక్వార్టర్స్లో జాదూమణి 5-0తో సుమామ రెహ్మాన్ (పాకిస్థాన్)ను చిత్తు చేశాడు.
ఇవి కూడా చదవండి:
జింబాబ్వేతో మూడో టీ20: టాస్ నెగ్గిన టీమిండియా
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: మళ్లీ అగ్రస్థానంలో భారత్