ప్రజ్ఞానంద శుభారంభం
ABN , Publish Date - Mar 30 , 2026 | 01:19 AM
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద శుభారంభం చేశాడు. ఆదివారం జరిగిన మొదటి రౌండ్లో అనీష్ గిరి (నెదర్లాండ్స్)ని...
దివ్య, వైశాలి గేమ్లు డ్రా
క్యాండిడేట్స్ చెస్ టోర్నీ
పీజియా (సైప్రస్): క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద శుభారంభం చేశాడు. ఆదివారం జరిగిన మొదటి రౌండ్లో అనీష్ గిరి (నెదర్లాండ్స్)ని 51 ఎత్తుల్లో ప్రజ్ఞానంద చిత్తు చేశాడు. ఈ గెలుపుతో ప్రజ్ఞానంద ఒక పాయింట్ దక్కించుకున్నాడు. మహిళల విభాగంలో భారత జీఎంలు దివ్యా దేశ్ముఖ్, వైశాలి తొలి రౌండ్ గేమ్లు డ్రాగా ముగిశాయి. ముజిచుక్ (ఉక్రెయి న్)తో దివ్య, బిబిసార అసబేయావా (కజకిస్థాన్)తో వైశాలి పాయింట్ పంచుకున్నారు.
ఇవి కూడా చదవండి:
ప్రొఫెషనల్ బాక్సింగ్లోకి మేరీకోమ్!
ఆ ప్లేయర్లపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాలి: సునీల్ గావస్కర్