విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా ఉగాది వేడుకలు..
ABN, Publish Date - Mar 19 , 2026 | 08:03 PM
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 2026 శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
1/10
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 2026 శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి.
2/10
ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
3/10
ఈ వేడుకల్లో జ్యోతి ప్రజ్వలన, ఉగాది పచ్చడి స్వీకరణ, వేద పండితుల పంచాంగ శ్రవణం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
4/10
కార్యక్రమంలో భాగంగా జ్యోతి ప్రజ్వలన చేస్తున్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.
5/10
ప్రముఖ వేద పండితులు మాడుగుల నాగఫణి శర్మ/ఫణీంద్ర శర్మ శ్రీ పరాభవ నామ సంవత్సర పంచాంగ శ్రవణం చేశారు.
6/10
ఈ ఏడాది రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం బాగుంటాయని, అమరావతి విశ్వనగరంగా ఎదుగుతుందని పేర్కొన్నారు,
7/10
అలాగే ఈ ఏడాది కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుందని మాడుగుల ఫణీంద్ర శర్మ తెలిపారు.
8/10
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం పాల్గొని ప్రసంగించారు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు.
9/10
ఉగాది పచ్చడి జీవితాన్ని ప్రతిబింబిస్తుందని.. పులుపు, తీపి, వగరు, చేదు, కారం వంటి రుచులు ఉంటాయన్నారు.
10/10
ఈ ఏడాది అంతా మంచి జరగాలని అందరం కోరుకుంటున్నామని సీఎం తెలిపారు. తెలుగు సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉగాదిని అధికారికంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.
Updated at - Mar 19 , 2026 | 08:04 PM