రాష్ట్రపతి, ప్రధానితో గవర్నర్ భేటీ
ABN , Publish Date - Apr 11 , 2026 | 03:54 AM
రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, ప్రధాని నరేంద్రమోదీతో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుక్రవారం వేర్వేరుగా భేటీ అయ్యారు. తొలుత రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ...
న్యూఢిల్లీ, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, ప్రధాని నరేంద్రమోదీతో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుక్రవారం వేర్వేరుగా భేటీ అయ్యారు. తొలుత రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ముర్ముతో సమావేశమైన గవర్నర్.. అనంతరం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. తెలంగాణ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన తొలిసారిగా రాష్ట్రపతి, ప్రధానితో సమావేశమయ్యారు.