Share News

Supreme Court: ‘ఐ ప్యాక్‌’లో ఈడీ సోదాల వివాదంలో మమతా బెనర్జీపై సుప్రీం సీరియస్‌

ABN , Publish Date - Jan 17 , 2026 | 04:55 AM

కోల్‌కతాలో ‘ఐ ప్యాక్‌’ అధిపతి ప్రతీక్‌ జైన్‌ ఇంట ఈడీ సోదాలను అడ్డుకున్న వ్యవహారంలో బెంగాల్‌ సీఎం మమతపై సుప్రీంకోర్టు సీరియస్‌ అయింది.

Supreme Court: ‘ఐ ప్యాక్‌’లో ఈడీ సోదాల వివాదంలో మమతా బెనర్జీపై సుప్రీం సీరియస్‌

న్యూఢిల్లీ, జనవరి 16: కోల్‌కతాలో ‘ఐ ప్యాక్‌’ అధిపతి ప్రతీక్‌ జైన్‌ ఇంట ఈడీ సోదాలను అడ్డుకున్న వ్యవహారంలో బెంగాల్‌ సీఎం మమతపై సుప్రీంకోర్టు సీరియస్‌ అయింది. ఈ వ్యవహారంలో ఈడీ అధికారులపై బెంగాల్‌ పోలీసులు నమోదు చేసిన 3 కేసుల్లో దర్యాప్తుపై స్టే విధించింది. ఈడీ తదితర కేంద్ర సంస్థల దర్యాప్తులో రాష్ట్ర సంస్థలు జోక్యం చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని స్పష్టం చేసింది. ‘‘ఒక పార్టీకి చెందిన ఎన్నికల పనుల్లో వేలుపెట్టే అధికారం కేంద్ర దర్యాప్తు సంస్థలకు లేదు. అయితే ఆ ముసుగులో వేరే కేసులో దర్యాప్తు చేస్తున్న అధికారులను అడ్డుకోవచ్చా’’ అని ప్రశ్నించింది. మమత, డీజీపీ రాజీవ్‌కుమార్‌ తదితరులకు నోటీసులు జారీచేసింది. ఈ వ్యవహారంలో సీబీఐ విచారణకు ఆదేశించాలని ఈడీ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోరారు. గతంలో సీబీఐకి, బెంగాల్‌ ప్రభుత్వానికి మధ్య వేరే కేసులో జరిగిన ఘర్షణను ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇది పరిపాటిగా మారిందన్నారు.

Updated Date - Jan 17 , 2026 | 04:55 AM