Rajnath Singh: ప్రిస్ర్కిప్షన్పై ఆర్ఎక్స్ రాసే చేతుల్లోకి ఆర్డీఎక్స్
ABN , Publish Date - Jan 03 , 2026 | 02:38 AM
దేశంలో వైట్ కాలర్ ఉగ్రవాదం పెరగడం ఆందోళనకర పరిణామమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఇటీవలి ఢిల్లీ కారు బాంబు పేలుడు ఘటనను ఉటంకిస్తూ....
దేశంలో పెరుగుతున్న వైట్ కాలర్ ఉగ్రవాదం: రాజ్నాథ్
ఉదయ్పూర్, జనవరి 2: దేశంలో వైట్ కాలర్ ఉగ్రవాదం పెరగడం ఆందోళనకర పరిణామమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఇటీవలి ఢిల్లీ కారు బాంబు పేలుడు ఘటనను ఉటంకిస్తూ, ఈ ఘటనలో కొందరు వైద్యులు పాలుపంచుకున్న విషయం ఆయన గుర్తుచేశారు. ఇక్కడ జరిగిన భోపాల్ నోబెల్స్ యూనివర్సిటీ 104వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఉన్నత విద్యావంతులు సంఘ వ్యతిరేక, దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాలు పంచుకోవడం చూస్తే, మన విద్యా వ్యవస్థలో ఎటువంటి మార్పులు రావాల్సి ఉన్నదో స్పష్టం అవుతున్నదన్నారు. ‘‘ప్రిస్ర్కిప్షన్పై ఆర్ఎక్స్ (రెసిపీ-టు టేక్ దిస్ మెడిసిన్) రాసే చేతులతో ఆర్డీఎక్స్ పట్టుకుంటున్నారు.