నేటి నుంచి ప్రధాని 5 దేశాల పర్యటన
ABN , Publish Date - May 15 , 2026 | 04:08 AM
మిత్రదేశాలతో లోతైన, విస్తృత భాగస్వామ్యమే లక్ష్యంగా ప్రధాని మోదీ శుక్రవారం విదేశీ పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు.
న్యూఢిల్లీ, మే 14: మిత్రదేశాలతో లోతైన, విస్తృత భాగస్వామ్యమే లక్ష్యంగా ప్రధాని మోదీ శుక్రవారం విదేశీ పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు. 20వ తేదీ వరకు ఐదు దేశాల్లో.. యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీల్లో పర్యటించనున్నారు. తొలుత శుక్రవా రం యూఏఈ వెళ్తారు. వాణిజ్యం, పెట్టుబడులు తది తర అంశాలపై ఆయా దేశాధినేతలతో చర్చిస్తారు.