కుకీ, నాగా తెగల మధ్య ఘర్షణలు.. మణిపుర్లో మళ్లీ ఉద్రిక్తత!
ABN , Publish Date - Apr 26 , 2026 | 07:30 AM
మణిపుర్ రాష్ట్రంలో మరోసారి హింస చెలరేగింది. శనివారం ఇంఫాల్లో మైతీ సామాజిక వర్గానికి చెందిన సమగ్రత సమన్వయ కమిటీ నిర్వహించిన పాదయాత్ర తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రెండు రోజులుగా కుకీ, నాగా తెగల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇంఫాల్ (మణిపూర్) ఏప్రిల్ 26: మణిపుర్ రాష్ట్రంలో మరోసారి హింస చెలరేగింది. శనివారం ఇంఫాల్లో మైతీ సామాజిక వర్గానికి చెందిన సమగ్రత సమన్వయ కమిటీ నిర్వహించిన పాదయాత్ర తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రెండు రోజులుగా కుకీ, నాగా తెగల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
మణిపుర్ ముఖ్యమంత్రి యుమ్నం ఖేమ్చంద్ సింగ్ నివాసం వైపు వెళ్లేందుకు COCOMI కమిటీ పాదయాత్రగా బయలుదేరగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో నిరసనకారులు, పోలీసులకు మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు నిరసనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
గత రెండు రోజులుగా కుకీ, నాగా తెగల మధ్య చోటు చేసుకున్న ఘర్షణల నేపథ్యంలో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ అశాంతిని నిరసిస్తూ, శాంతిని కోరుతూ మైతీ కమిటీ ఈ పాదయాత్ర చేపట్టింది. హింస వ్యాపించకుండా ఉండేందుకు సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారం జరగకుండా అరికట్టడానికి అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేశారు. అలాగే, ఇంఫాల్తో పాటు సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ నాయకుల మధ్య విభేదాలు.. లీక్ అయిన రహస్య లేఖలో ఏముంది..
నా ఇంట్లోనే నన్ను గుండాతో కొట్టించారు.. కేజ్రీవాల్పై ఎంపీ స్వాతి సంచలన ఆరోపణలు..