Share News

హాస్టల్లో దెయ్యాలు.. ఇళ్లకు పిల్లలు!

ABN , Publish Date - Aug 15 , 2026 | 05:31 AM

మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఓ ప్రభుత్వ హాస్టల్‌లో దెయ్యాలు, భూతాలు ఉన్నాయంటూ విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందారు. నాకు దెయ్యం కనిపించింది అని ఒకరంటే..

హాస్టల్లో దెయ్యాలు.. ఇళ్లకు పిల్లలు!

  • నవ్వులు, వింత శబ్ధాలు వినిపిస్తున్నాయని ఫిర్యాదు

  • ప్రభుత్వ హాస్టల్‌ను ఖాళీ చేసిన 608 మంది పిల్లలు

  • మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఘటన

ముంబై, ఆగస్టు 14: మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఓ ప్రభుత్వ హాస్టల్‌లో దెయ్యాలు, భూతాలు ఉన్నాయంటూ విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందారు. నాకు దెయ్యం కనిపించింది అని ఒకరంటే.. ఆ దెయ్యం నవ్వులు నాకు వినిపించాయ్‌ అని మరొకరు చెప్పడం మొదలుపెట్టారు. ఇంకొకరేమో ఆ దెయ్యం వింత అరుపులు తనను భయపెడుతున్నాయని, వింత వింత శబ్ధాలు వినిపిస్తున్నాయని భయపడిపోయారు. ఈ ప్రచారంతో మిగతా పిల్లలు హడలిపోయారు. ఫలితంగా 263 మంది బాలురు, 345 మంది బాలికలు ‘బాబోయ్‌.. ఈ హాస్టల్లో మేం ఉండలేం’ అంటూ ఇళ్లకు వెళ్లిపోయారు! స్కూల్‌ హెడ్‌మాస్టర్‌ చొరవతో మానసిక వైద్యులు రంగంలోకి దిగారు. పిల్లల్లో భయం, మానసిక ఒత్తిడి ఫలితంగా వచ్చే మాస్‌ హిస్టీరియా కారణంగానే వారిలో దెయ్యాల భయం నెలకొందని వివరించారు.

Updated Date - Aug 15 , 2026 | 05:32 AM