ఇక పోలీసు పర్యవేక్షకుల సమక్షంలో రాష్ట్ర పోలీసు సిబ్బందికి విధుల అప్పగింత
ABN , Publish Date - Feb 25 , 2026 | 12:42 AM
ఇకపై పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాల వద్ద విధుల్లో ఉండే రాష్ట్ర పోలీసు సిబ్బందిని నియోజకవర్గాల్లో విధుల్లో ఉన్న కేంద్ర పోలీసు పరిశీలకుల సమక్షంలో ఎవరిని ఎక్కడికి ...
ఓటింగ్ విధుల్లో ఉండే వారికి సంబంధించి ఈసీ ఆదేశం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: ఇకపై పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాల వద్ద విధుల్లో ఉండే రాష్ట్ర పోలీసు సిబ్బందిని నియోజకవర్గాల్లో విధుల్లో ఉన్న కేంద్ర పోలీసు పరిశీలకుల సమక్షంలో ఎవరిని ఎక్కడికి పంపాలో (ర్యాండమైజేషన్) నిర్ణయించాలని ఎన్నికల సంఘం(ఈసీ) ఆదేశించింది. పారదర్శకతను పెంచే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. పక్షపాత ధోరణిని నివారించేందుకు స్థానిక పోలీసులను వారి ప్రస్తుత స్టేషన్ ప్రాంతాలకు వెలుపల విధులు అప్పగించనున్నారు. భవిష్యత్తులో జరిగే అన్ని లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రంలో మోహరించే రాష్ట్ర పోలీసు సిబ్బందిని ఆ జిల్లాలోని నియోజకవర్గాల్లోని పోలీసు పరిశీలకుల సమక్షంలో ఎవరు ఎక్కడకు వెళ్లాలో నిర్ణయిస్తారని సోమవారం రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు, డీజీపీలకు పంపిన లేఖలో ఈసీ పేర్కొంది.