Share News

దేశమంతటా ఒకే ఒక స్వచ్ఛమైన ఓటర్ల జాబితా

ABN , Publish Date - Feb 25 , 2026 | 12:45 AM

దేశమంతటా ఒకే ఒక స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను రూపొందించాలని, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పాటించాలని కేంద్ర, రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు నిర్ణయించారు.

దేశమంతటా ఒకే ఒక స్వచ్ఛమైన ఓటర్ల జాబితా

  • ఎలక్షన్‌ కమిషన్‌ సమావేశంలో డిక్లరేషన్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): దేశమంతటా ఒకే ఒక స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను రూపొందించాలని, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పాటించాలని కేంద్ర, రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు నిర్ణయించారు. మంగళవారం ఇక్కడ జరిగిన భారత ఎన్నికల కమిషన్‌, రాష్ట్రాల ఎన్నికల కమిషనర్ల రౌండ్‌ టేబుల్‌ సదస్సులో ఈ మేరకు జాతీయ డిక్లరేషన్‌-2026ను ఏకగ్రీవంగా ఆమోదించారు. 27 సంవత్సరాల అనంతరం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌ కుమార్‌ నేతృత్వంలో ఇలాంటి రౌండ్‌ టేబుల్‌ సదస్సు జరగడం గమనార్హం. స్వచ్చమైన ఓటర్ల జాబితాను రూపొందించడం ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన, జాతీయ ప్రాధాన్యత గల విషయమని ఈ సదస్సు పేర్కొంది. పంచాయతీలు, మునిసిపల్‌ ఎన్నికల చట్టాలను పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికల చట్టాలకు అనుగుణగా రూపొందించాలని తెలిపింది. పారదర్శకంగా, సమర్థంగా, న్యాయపరంగా బలంగా ఉండే ఎన్నికల ప్రక్రియలు అమలు అయ్యేలా చూస్తామని ప్రధాన ఎన్నికల కమిషన్‌ జ్ఞానేష్‌ కుమార్‌ తెలిపారు.

Updated Date - Feb 25 , 2026 | 12:45 AM