Share News

మమతపై ఎఫ్‌ఐఆర్‌కు అనుమతించండి: ఈడీ

ABN , Publish Date - Jan 13 , 2026 | 06:20 AM

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత సహా ఆ రాష్ట్ర డీజీపీ, కోల్‌కతా పోలీసు కమిషనర్‌లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేందుకు ఈడీ సిద్ధమైంది.

మమతపై ఎఫ్‌ఐఆర్‌కు అనుమతించండి: ఈడీ

న్యూఢిల్లీ, జనవరి 12: పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత సహా ఆ రాష్ట్ర డీజీపీ, కోల్‌కతా పోలీసు కమిషనర్‌లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేందుకు ఈడీ సిద్ధమైంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు అనుమతి కోరుతూ సోమవారం పిటిషన్‌ దాఖలు చేసింది. రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ ‘ఐ-ప్యాక్‌’ మనీ లాండరింగ్‌ కేసులో విచారణకు అడ్డుపడుతున్నారని ఈడీ అధికారులు పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధ హోదాల్లో ఉన్న వారు, పోలీసు అధికారులు.. చట్టబద్ధమైన విచారణలో జోక్యం చేసుకున్నారని ఆరోపించారు.

Updated Date - Jan 13 , 2026 | 06:21 AM