బడ్జెట్ 2026: ఏపీతో సహా మరో నాలుగు రాష్ట్రాలతో మైనింగ్ మిషన్
ABN , Publish Date - Feb 01 , 2026 | 11:55 AM
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ఖనిజ వనరులున్న రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించనున్నట్టు ప్రకటించారు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ఖనిజ వనరులున్న రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించనున్నట్టు ప్రకటించారు (Centre mining mission). రేర్ ఎర్త్ మినరల్స్ కోసం నాలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఏపీ, ఒడిశా, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో కలిసి ప్రత్యేక మైనింగ్ మిషన్ ఏర్పాటు చేయబోతున్నట్టు మంత్రి బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు (Andhra Pradesh mining news). అలాగే ప్రపంచస్థాయి కంటెయినర్ ఉత్పత్తి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.