అటల్ పెన్షన్ పథకం మరో ఐదేళ్లు పొడిగింపు
ABN , Publish Date - Jan 22 , 2026 | 03:16 AM
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్ నాలుగో బిడ్డకు జన్మనివ్వనున్నారు. మంగళవారం ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ శుభవార్తను పంచుకున్నారు
న్యూఢిల్లీ, జనవరి 21: అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు పెన్షన్ ఇచ్చేందుకు తీసుకొచ్చిన అటల్ పెన్షన్ యోజన (ఏపీవై)ను మరో ఐదేళ్లపాటు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకాన్ని పొడిగిస్తూ కేంద్ర క్యాబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి విస్తృత ప్రచారం కల్పించాలని, తగినన్ని నిధులు సమకూర్చాలని తీర్మానించింది. 2015 మార్చి 9న ప్రారంభించిన అటల్ పెన్షన్ పథకం కింద 60 ఏళ్లు దాటిన అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్ అందజేస్తున్నారు.