Share News

‘ప్రైవేటు’లో 66శాతం సిజేరియన్లే!

ABN , Publish Date - May 30 , 2026 | 05:15 AM

ఏపీలో కుటుంబ ఆరోగ్యం, పోషకాహారం, మహిళా సాధికారత అంశాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా విడుదలైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(నేషనల్‌ ఫ్యామిలీ....

‘ప్రైవేటు’లో 66శాతం సిజేరియన్లే!

  • ఏపీలో ఇంటర్నెట్‌ వాడే మహిళలు 63శాతం

  • 32 శాతం మంది మహిళలకు ఇళ్లు, భూములు

  • కుటుంబ నిర్ణయాల్లో మహిళలు 84 శాతం

  • మద్యం సేవిస్తున్న పురుషులు 23 శాతమే!

  • జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ఆసక్తికర అంశాలు

న్యూఢిల్లీ, మే 29(ఆంధ్రజ్యోతి): ఏపీలో కుటుంబ ఆరోగ్యం, పోషకాహారం, మహిళా సాధికారత అంశాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా విడుదలైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే) 2023-24 నివేదికలో ఈ మేరకు పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని ఆరోగ్య, సామాజిక సూచికల వివరాలు కింది విధంగా ఉన్నాయి.

జనాభా, కుటుంబ వివరాలు:

  • రాష్ట్ర జనాభాలో ఐదేళ్ల లోపు పిల్లలు 6.9 శాతం ఉన్నారు. 15 ఏళ్ల లోపు పిల్లలు 21.1శాతం ఉన్నారు.

  • 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు 13.9 శాతం కాగా, గ్రామీణ ప్రాంతంలో వీరు 14.7 శాతం. పట్టణాల్లో వీరు 12.3 శాతం.

  • రాష్ట్రంలో 99.7శాతం ఇళ్లకు విద్యుత్‌ సౌకర్యం ఉంది.

  • 97.6శాతం కుటుంబాలకు తాగునీటి సౌకర్యం ఉంది.

  • ఏదో ఒక ఆరోగ్య బీమా లేదా ఫైనాన్సింగ్‌ పథకం వర్తించే కుటుంబాలు 91.9శాతానికి పెరిగాయి.

  • 31.9 శాతం మంది మహిళలు తమ పేరు మీద లేదా ఉమ్మడిగా ఇల్లు, భూమిని కలిగి ఉన్నారు. ఇది గ్రామీణ మహిళల్లో 36.4శాతంగా ఉంది.

  • ఇంటర్నెట్‌ను వినియోగించే మహిళలు 21 శాతం నుంచి 63.6శాతంగా, గ్రామీణంలో58.3 శాతంగా ఉంది.


వివాహం, సంతానోత్పత్తి:

  • 20-24 ఏళ్ల మహిళల్లో 18 ఏళ్లలోపే పెళ్లయిన వారి శాతం 29.3 నుంచి 25.1 శాతానికి తగ్గింది.

  • సంతానోత్పత్తి రేటు(ఒక మహిళకు సగటున 1.8గా నమోదైంది. గతంలో 1.7 టీఎఎఫ్ఆర్‌ ఉంది.

  • 69.5శాతం కుటుంబ నియంత్రణ చేయించుకున్నారు.

  • 18-49 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళల్లో 22.7 శాతం మంది గృహహింసను ఎదుర్కొంటున్నారు.

  • 84శాతం మహిళలు నిర్ణయాల్లో పాలు పంచుకుంటున్నారు.

తల్లి, శిశు ఆరోగ్యం:

  • 98.4శాతం ప్రసవాలు ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయి.

  • రాష్ట్రంలో సిజేరియన్‌ ప్రసవాలు 52.2శాతంగా ఉన్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో 66.2 శాతం, ప్రభుత్వ ఆస్పత్రులలో 38శాతం సిజేరియన్లు జరుగుతున్నాయి.

  • 12-23 నెలల వయసున్న పిల్లల్లో 87.7 శాతం మందికి పూర్తి స్థాయిలో టీకాలు వేశారు.

పిల్లల పోషకాహార స్థితి:

  • 5 ఏళ్ల లోపు పిల్లలలో 24.6 శాతం మందిలో వయస్సుకు తగ్గ ఎదుగుదల లేదు.

  • 5 ఏళ్ల లోపు పిల్లలలో ఎత్తుకు తగ్గ బరువులో లేనివారు 12.3శాతం

  • 5 ఏళ్ల లోపు పిల్లల్లో వయసుకు తగ్గ బరువులేనివారు 23.2శాతం

ఆరోగ్యం:

  • 15 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళల్లో 21.8 శాతం అధిక మధుమేహంతో బాధపడుత ూ మందులు తీసుకుంటున్నారు. పురుషుల్లో 24.1శాతం ఉన్నారు. అధిక రక్తపోటుతో 24.1శాతం మంది మహిళలు బాధపడుతున్నారు. పురుషులు 26 శాతం ఉన్నారు.

Updated Date - May 30 , 2026 | 05:16 AM