Share News

కువైట్‌ విద్యుత్‌ కేంద్రంపై ఇరాన్‌ దాడి

ABN , Publish Date - Mar 31 , 2026 | 05:03 AM

కువైట్‌లోని ఒక విద్యుత్‌ కేంద్రం కాంప్లెక్స్‌పై ఇరాన్‌ క్షిపణి దాడి చేయటంతో అక్కడ పనిచేస్తున్న ఒక భారతీయుడు మరణించాడు.

కువైట్‌ విద్యుత్‌ కేంద్రంపై ఇరాన్‌ దాడి

కువైట్‌ సిటీ, మార్చి 30: కువైట్‌లోని ఒక విద్యుత్‌ కేంద్రం కాంప్లెక్స్‌పై ఇరాన్‌ క్షిపణి దాడి చేయటంతో అక్కడ పనిచేస్తున్న ఒక భారతీయుడు మరణించాడు. ఆదివారం సాయంత్రం ఈ దాడి జరిగిందని కువైట్‌ విద్యుత్‌ శాఖ సోమవారం ప్రకటించింది. ఈ దాడిలో విద్యుత్‌, సముద్ర జలశుద్ధి కేంద్రం తీవ్రంగా దెబ్బతిన్నదని వెల్లడించింది. అమెరికా-ఇరాన్‌ యుద్ధంలో మరణించిన భారతీయుల సంఖ్య 8కి చేరినట్లు భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Updated Date - Mar 31 , 2026 | 05:03 AM