కేజీబీవీల్లో 299 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ABN , Publish Date - May 26 , 2026 | 04:53 AM
రాష్ట్రవ్యాప్తంగా 352 కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 299 బోధన సిబ్బంది..
అమరావతి, మే 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా 352 కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 299 బోధన సిబ్బంది పోస్టులను ఒప్పంద(కాంట్రాక్ట్) ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టరు బి.శ్రీనివాసరావు తెలిపారు.