టీజీఎస్ఆర్టీసీ నుంచి ఓలెక్ట్రాకు భారీ ఆర్డర్
ABN , Publish Date - Feb 24 , 2026 | 06:06 AM
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ (టీజీఎస్ఆర్టీసీ) నుంచి ఎలక్ట్రిక్ బస్పుల సరఫరా కోసం భారీ ఆర్డర్ను దక్కించుకున్నట్లు ఒలెకా్ట్ర గ్రీన్టెక్ లిమిటెడ్ వెల్లడించింది...
1,085 ఎలక్ట్రిక్ బస్సుల సరఫరాకు ఎల్ఓఐ
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ (టీజీఎస్ఆర్టీసీ) నుంచి ఎలక్ట్రిక్ బస్పుల సరఫరా కోసం భారీ ఆర్డర్ను దక్కించుకున్నట్లు ఓలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ వెల్లడించింది. పీఎం ఈ-డ్రైవ్ కింద అనుబంధ సంస్థ అయిన ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 1,085 ఎలక్ట్రిక్ బస్సుల సరఫరా కాంట్రాక్ట్ను గెలుచుకుందని తెలిపింది. ఈ మేరకు టీజీఎ్సఆర్టీసీ నుంచి లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్ఓఐ)ను అందుకున్నట్లు తెలిపింది. కాగా ఈ బస్సులను పూర్తిగా హైదరాబాద్లోనే వినియోగించనున్నట్లు ఒలెకా్ట్ర పేర్కొంది. పీఎం ఈ-డ్రైవ్ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ ఆర్డర్ ఎంతగానో దోహదపడటమే కాకుండా మేకిన్ ఇండియా విజన్ లక్ష్యాలకు తాము కట్టుబడి ఉన్నామనేందుకు ఇది నిదర్శనం గా ఉండనుందని ఒలెకా్ట్ర గ్రీన్టెక్ ఎండీ మహేశ్ బాబు తెలిపారు. ఆర్డర్లో భాగంగా భారతీయ రహదారులకు అనుగుణంగా ఉండే 12 మీటర్ల లో-ఫ్లోర్ ఏసీ, నాన్ ఏసీ బస్సులను వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఒకసారి చార్జింగ్తో ఈ బస్సులు 250 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయని వెల్లడించింది.
ఇవీ చదవండి:
భారీ ఉగ్రకుట్ర భగ్నం! 8 మంది అరెస్టు
రణ్వీర్ సింగ్కు బెదిరింపులు.. రూ.10 కోట్లు చెల్లించాలని డిమాండ్