మహీంద్రా, స్వరాజ్ ట్రాక్టర్ల ధర పెంపు
ABN , Publish Date - Apr 08 , 2026 | 05:36 AM
దేశీయ వ్యవసాయ పరికరాల రంగంలో అగ్రగామి సంస్థ మహీంద్రా గ్రూప్ ట్రాక్టర్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది...
ముంబై: దేశీయ వ్యవసాయ పరికరాల రంగంలో అగ్రగామి సంస్థ మహీంద్రా గ్రూప్ ట్రాక్టర్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ముడిసరుకు ధరలు భారీగా పెరగడం వల్ల తయారీ ఖర్చులు అధికమవడంతో సంస్థకు చెందిన మహీంద్రా, స్వరాజ్ ట్రాక్టర్ల ధరలను పెంచుతున్నట్లు తెలిపింది. వివిధ మోడళ్లు, ప్రాంతాలను బట్టి ధరల పెంపు వేర్వేరుగా ఉంటుందని పేర్కొంది. మహీం ద్రా ట్రాక్టర్స్లోని అన్ని మోడళ్ల ధరల పెంపు నేటి నుంచే అమల్లోకి వస్తుండగా, స్వరాజ్ బ్రాండ్ ట్రాక్టర్ల ధరలు ఏప్రిల్ 21 నుంచి పెరగనున్నాయి.
ఇవి కూడా చదవండి..
యుద్ధంలో అమెరికా గెలిస్తే..హోర్ముజ్లో టోల్ వసూలు చేస్తాం: డొనాల్డ్ ట్రంప్
పనామా కాలువలో భారీ బ్లాస్ట్.. షాకింగ్ వీడియో వైరల్..