Share News

బులియన్‌ మార్కెట్‌ పైపైకి

ABN , Publish Date - Feb 24 , 2026 | 06:10 AM

బులియన్‌ మార్కెట్లో మళ్లీ ర్యాలీ ప్రారంభమైంది. సోమవారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం రూ.3,300 లాభంతో...

బులియన్‌ మార్కెట్‌ పైపైకి

  • 10 గ్రాముల పసిడి రూ.1,62,800

  • కిలో వెండి ధర రూ.2.72 లక్షలు

న్యూఢిల్లీ: బులియన్‌ మార్కెట్లో మళ్లీ ర్యాలీ ప్రారంభమైంది. సోమవారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం రూ.3,300 లాభంతో రూ.1,62,800 వద్ద, కిలో వెండి రూ.8,000 లాభంతో రూ.2.72 లక్షల వద్ద ముగిశాయి. గత మూడు వారాల్లో బంగారం, వెండి ధరలు ఈ స్థాయికి చేరడం ఇదే మొదటిసారి. అంతర్జాతీయ స్పాట్‌ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు లాభాల బాట పట్టాయి. సోమవారం ఔన్స్‌ (31.10 గ్రాములు) 5,215 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఔన్స్‌ వెండి ధర 87.35 డాలర్లకు చేరింది.

Updated Date - Feb 24 , 2026 | 06:10 AM