ఎయిర్టెల్ చార్జీ పెంపు!
ABN , Publish Date - Apr 21 , 2026 | 06:33 AM
దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ 84 రోజుల గడువుతో కూడిన ప్రీ-పెయిడ్ ప్లాన్ ధరను...
84 రోజుల గడువు ప్లాన్ ధర రూ.899
న్యూఢిల్లీ: దేశంలో రెండో అతిపెద్ద ప్రైవేట్ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ 84 రోజుల గడువుతో కూడిన ప్రీ-పెయిడ్ ప్లాన్ ధరను రూ.859 నుంచి రూ.899కి పెంచింది. అంటే, ధర నికరంగా 4.6% పెరిగింది. అంతేకాదు, 77 రోజుల గడువుతో ఇప్పటివరకు ఆఫర్ చేసిన రూ.799 టారి ఫ్ ప్లాన్ను కంపెనీ ఉపసంహరించుకుంది. రూ.899 ప్లాన్లో భాగంగా వినియోగదారులకు 84 రోజుల పాటు రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లభించనున్నాయి.
Also Read:
ఏసీబీ వలలో వీఆర్వో.. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టివేత
జగన్వి క్రిమినల్ రాజకీయాలు.. మంత్రి నిమ్మల ధ్వజం
For More Latest News