వాసవి ధామ్లో కర్ణాటక భక్తుల పూజలు
ABN , Publish Date - Aug 20 , 2026 | 12:21 AM
పెనుగొండ వాసవి శాంతి ధామ్ నందు కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిన భక్తులచే బుధవారం ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు.
వాసవి పెనుగొండ, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): పెనుగొండ వాసవి శాంతి ధామ్ నందు కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిన భక్తులచే బుధవారం ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోమాత పూజ నగరేశ్వరస్వామికి రుద్రాభిషేకం, దంపతీ పూజలు, వాసవి హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పలువురు భక్తులు పాల్గొన్నారు.