షిర్డీ సాయి ఆలయాభివృద్ధికి రెండెకరాలు
ABN , Publish Date - Jan 29 , 2026 | 12:05 AM
ఐఎస్ జగన్నాథపురం సుందర గిరిపై కొలువైన షిర్డీ సాయిబాబా ఆలయాభివృద్ధికి నిర్వాహకులు కొచ్చర్ల కోట వెంకట కామరాజు భార్య కొచ్చర్లకోట లలితమ్మకు రెండెకరాల భూమిని కేటా యిస్తూ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర..
ద్వారకాతిరుమల, జనవరి 28(ఆంధ్రజ్యోతి):ఐఎస్ జగన్నాథపురం సుందర గిరిపై కొలువైన షిర్డీ సాయిబాబా ఆలయాభివృద్ధికి నిర్వాహకులు కొచ్చర్ల కోట వెంకట కామరాజు భార్య కొచ్చర్లకోట లలితమ్మకు రెండెకరాల భూమిని కేటా యిస్తూ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సర్వే నెంబరు 425–194లో కొండ పోరంబోకుగా ఉన్న ఈ భూమిని ఎకరం రూ.30 లక్షల చొప్పున రెండెకరాల భూమికి రూ.60 లక్షలు చెల్లిస్తారు. యూడీఏ నుంచి డీపీఆర్, ఎన్వోసీ సమర్పణకు లోబడి ఈ భూమిని కేటాయిస్తారు. ఈ ప్రాంతం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.