Share News

వేడుకగా ప్రభల తీర్థం

ABN , Publish Date - Jan 17 , 2026 | 12:51 AM

మండలంలోని కందరవల్లిలో శుక్రవారం ప్రభల తీర్థం వేడుకగా జరిగింది.

వేడుకగా ప్రభల తీర్థం
కందరవల్లి, పెనుమంచిలి ప్రాంతాల సరిహద్దులో కొలువైన ప్రభలు

తరలి వచ్చిన ఐదు గ్రామాల ప్రభలు

ఆచంట, జనవరి 16(ఆంధ్రజ్యోతి): మండలంలోని కందరవల్లిలో శుక్రవారం ప్రభల తీర్థం వేడుకగా జరిగింది. సంక్రాంతి సందర్భంగా కను మ రోజున ఇక్కడ ప్రబల తీర్థం నిర్వహించడం ఆనవాయితీ. మండలం లోని కోడేరు, కరుగోరుమిల్లి, కందరవల్లి, వల్లూరు, పెనుమంచిలి గ్రామాల నుంచి ప్రభలను ఊరేగింపుగా తీసుకువచ్చి కందరవల్లి, పెను మంచిలి గ్రామ సరిహద్దు ప్రాంతంలో కొలువుతీర్చారు. వేలాది మంది భక్తులు ప్రభలను దర్శించుకున్నారు. సాయంత్రం ప్రభలు అక్కడి నుంచి తిరిగి వెళ్లిన తర్వాత తీర్థం ముగిసింది. ఆయా గ్రామాల ప్రజలు, దూర ప్రాంతాల్లో స్థిరపడిన వారు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.

వాసవి పెనుగొండ: వడలిలో ప్రభల తీర్థం శుక్రవారం నిర్వహించారు. పచ్చని పొలాలు మధ్య ఉమా అగస్త్యేశ్వరస్వామి కొలువై ఉన్నారు. ప్రభ ల తీర్థంతో పంటలు సమృద్ధిగా పండుతాయని భక్తుల విశ్వాసం.

Updated Date - Jan 17 , 2026 | 12:51 AM