అక్రమంగా మట్టి తరలిస్తున్న ఎనిమిది లారీల సీజ్
ABN , Publish Date - Mar 11 , 2026 | 12:38 AM
మండ లంలోని చిన్నవారిగూడెంలో ఉన్న ప్రధాన చెరువు నుంచి సోమవారం రాత్రి అక్రమంగా మట్టి తరలిస్తున్న 8 లారీలను పోలీసులు సీజ్ చేశారు. యథేచ్ఛగా మట్టితరలిస్తున్నా రంటూ ఆరోపిస్తూ గ్రామస్థులు అడ్డుకున్నారు.
అక్రమంగా మట్టి తరలిస్తున్న ఎనిమిది లారీల సీజ్
జంగారెడ్డిగూడెం, మార్చి 10(ఆంధ్రజ్యోతి): మండ లంలోని చిన్నవారిగూడెంలో ఉన్న ప్రధాన చెరువు నుంచి సోమవారం రాత్రి అక్రమంగా మట్టి తరలిస్తున్న 8 లారీలను పోలీసులు సీజ్ చేశారు. యథేచ్ఛగా మట్టితరలిస్తున్నా రంటూ ఆరోపిస్తూ గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈ విషయాన్ని పోలీసులకు, రెవెన్యూ అధికారులకు చేరవేశారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఎనిమిది లారీలను సీజ్ చేసి జంగారెడ్డిగూడెం స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. తహసీల్దార్ కె.స్లీవజోజి ఒక్కొక్క టిప్పర్కు రూ.7,500 చొప్పున జరిమానాలు విధించినట్టు పోలీసులు తెలిపారు.