అర్హులందరికీ సంక్షేమ పథకాలు
ABN , Publish Date - Aug 13 , 2026 | 12:07 AM
అర్హులందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందజే యనున్నట్లు మార్కెఫెడ్ చైర్మన్, నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కర్రోతు బంగార్రాజు తెలిపారు.
నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కర్రోతు బంగార్రాజు
భోగాపురం, ఆగస్టు12(ఆంధ్రజ్యోతి): అర్హులందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందజే యనున్నట్లు మార్కెఫెడ్ చైర్మన్, నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కర్రోతు బంగార్రాజు తెలిపారు. బుధవారం పోలిపల్లిలో 11మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.6.74 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షడు కర్రోతు సత్యనారాయణ, ఎం.శంకరరావు, అవనాపు సత్యనారాయణ, కోరాడ తాతారావు, కోలారామసూరి, గరె వెంకటరమణ పాల్గొన్నారు.