Share News

జల సంరక్షణ అందరి బాధ్యత

ABN , Publish Date - Apr 07 , 2026 | 12:23 AM

జల సంరక్షణ అందరి బాధ్యత కావాలని ఎమ్మెల్యే బేబీనాయన అన్నారు.

జల సంరక్షణ అందరి బాధ్యత
మాట్లాడుతున్న ఎమ్మెల్యే బేబీనాయన

బొబ్బిలి రూరల్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): జల సంరక్షణ అందరి బాధ్యత కావాలని ఎమ్మెల్యే బేబీనాయన అన్నారు. సోమవారం అలజంగిలోని సీతారామ సాగరంలో ‘నీటి భద్రత - సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్ర మానికి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువు లను అభివృద్ధి చేసి రైతులకు సంపూర్ణంగా సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా నీటి పొదుపును కీలకాంశంగా తీసుకుని ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టేలా చూడాలన్నారు. చెరువు ల్లో పూడిక తీత, కాలువల మరమ్మతులు, నీటి పొదుపు చర్యలు చేపట్టడంలో సాగునీటి సం ఘాల సభ్యులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి నీటి చుక్కనూ సంరక్షించడం, ప్రతి ఎకరాకు నీరందించడం, ప్రతి రైతుకూ భరోసా ఇవ్వడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. నియోజకవర్గంలోని చెరువులన్నీ నింపి భూగర్బ జలమట్టాన్ని కనీసం 1.5 మీటర్ల మేరకు పెంచడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని అధికారులను కు ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రవికుమార్‌, నాలుగు మండలాల ఏవోలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2026 | 12:23 AM