Share News

వీబీజీ రామ్‌జీ పనుల పరిశీలన

ABN , Publish Date - Sep 03 , 2026 | 12:44 AM

మెట్టవలస, కృష్ణాపురం గ్రామాల్లో చేపడుతున్న వీబీజీ రామ్‌జీ పనులను బుధవారం డ్వామా పీడీ ఎస్‌.శారదాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

వీబీజీ రామ్‌జీ పనుల పరిశీలన
మెట్టవలసలో చెరువు పనులు పరిశీలిస్తున్న పీడీ శారదాదేవి

బొబ్బిలి రూరల్‌, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): మెట్టవలస, కృష్ణాపురం గ్రామాల్లో చేపడుతున్న వీబీజీ రామ్‌జీ పనులను బుధవారం డ్వామా పీడీ ఎస్‌.శారదాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మెట్టవలసలో చేపడుతున్న మల్లమ్మ చెరువు పనులు, కృష్ణాపురంలో ఫిష్‌పాండ్‌ పనులను పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ సందర్బంగా ఆమె వేతనదారులతో మాట్లాడారు. ప్రభు త్వం నిర్ధేశించిన సమయంలో పనులు చేపడుతూ రోజుకు రూ.312 గరిష్ఠ వేతనం పొందాలన్నారు. సమయపాలన పాటించకపోతే తక్కువ వేతనం వచ్చే అవకాశం ఉందని వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో పి.రవికుమార్‌, ఏపీవో లక్ష్మీపతిరాజు పాల్గొన్నారు.

Updated Date - Sep 03 , 2026 | 12:44 AM